మానవుడు సుఖసౌఖ్యాలతో విలసిల్లుతున్న సమయంలో అడ్డుపడేదే అనారోగ్యం. ఇది ముమ్మాటికీ నిజం! ఎందుకంటే దేవతలకు సైతం అనారోగ్యం కలిగి ఆరోగ్యం కోసం తీర్థయాత్రలు చేసి పవిత్ర తీర్థ జలాలలో స్నానమాచరించి వారి రోగాలను పోగొట్టుకున్న పురాణగాధలెన్నో మనము వినియున్నాము. దేవతల వైద్యునిగా భావించే ధన్వంతరి, మానవ వైద్య పితామహుడిగా పేరొందిన చరకుడు వాడిన విధానమే వనమూలికా విధానము. |
|
ఈ వనమూలికా విధానమే కాలగమనములో కేవలం ముడి పదార్ధంలా కాక శుద్ధి చేయబడి, రోగికి రోగ కారకమే మందనే క్రొత్త వైద్య విధానాన్ని కనుగొని ఎన్నో సత్ఫలితాలను సాధించిన డా. శామ్యూల్ క్రిస్టియన్ ఫ్రెడ్రిచ్ హానిమన్ గారు ఈ విధానానికి "హోమియోపతి" అని నామకరణం చేయుట వలన డా. శామ్యూల్ హానిమన్ గారిని హోమియో వైద్య పితామహుడు అంటాము. సర్వ మానవాళికి అందుబాటులో వున్న ఈ మందులను తగు మోతాదులలో అందిస్తూ సోరాసిస్, సిఫిలిసిస్, సైకోసిస్ అను మూడు తత్వాలు గల మానవులకు వస్తున్న రోగాలను తత్వ విధానంగా కనుగొని నివారణ మరియు నిర్మూలన చేస్తూ ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి గత 25 సంవత్సరాలుగా మా వంతుగా మానవులకు ఉచిత సేవలను అందిస్తున్నాము. రోగి స్థితిగతులను బట్టీ కొందరికి ఉచితముగా మందులిస్తూ మఱికొన్ని సందర్భాలలో సలహాలనూ, సూచనలనూ అందిస్తూ ముందుకి సాగిపోతున్నాము.
గమనిక: మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు.మా నుండీ మెయిల్ కోసం కాస్త వేచి ఉండండి. సంప్రదించిన వారి వరుస క్రమంలో మేము ప్రతిస్పందిస్తాము.